News10th Oct 04:21 PMSunil Byrisetty1 min read

ఆయుష్ శాఖ కు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం స్

ఆయుష్ శాఖ కు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం స్ధానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్ స్టైఫండ్స్ పెంచినందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం చేశారు. మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ దేశానికే ఆయుష్ శాఖను ఆదర్శంగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్ధుల పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ ను పెంచిందన్నారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం రూ. 166 కోట్లు మంజూరు చేసిందన్నారు. ధర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం ఆయుష్ శాఖను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కేంద్రానికి పంపించాల్సిన నివేదికలను పంపక పోవడం వల్ల మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆయుష్ శాఖకు కేటాయింపు జరగలేదన్నారు.
Andhra Pradesh news
Ayush department
health ministry
Satya Kumar Yadav
central government funds
Ayurvedic colleges
NTR Health University
ధర్మవరం
కాకినాడ
విద్యార్థుల స్టైఫండ్
వైద్య అభివృద్ధి
Scroll for the next article