News6th Dec 01:27 PMSunil Byrisetty1 min read
విమాన టికెట్ ధరల పెంపుపై కేంద్రం ఆగ్రహం
విమాన టికెట్ ధరల అడ్డగోలు పెంపుపై కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ఇండిగో వివాదాన్ని ఆసరాగా తీసుకొని చేస్తున్న ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో సర్వీసులు రద్దయి
విమాన టికెట్ ధరల అడ్డగోలు పెంపుపై కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ఇండిగో వివాదాన్ని ఆసరాగా తీసుకొని చేస్తున్న ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన టికెట్ ధరలను క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలంది. ఈమేరకు అన్ని ఎయిర్లైన్లకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని కేంద్రం ఆదేశించింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలంది.