News18th Jul 02:59 PMSunil Byrisetty1 min read
టీడీపీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు
టీడీపీలో ప్రక్షాళనకు ‘చంద్రబాబు’ సంకేతం ఇచ్చారు. కొంతమంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను వదులుకోవడాన
టీడీపీలో ప్రక్షాళనకు ‘చంద్రబాబు’ సంకేతం ఇచ్చారు. కొంతమంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను వదులుకోవడానికీ వెనుకాడబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తేడాగా వ్యవహరించే అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని.. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు త్వరలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు.