News20th Jul 01:56 PMSunil Byrisetty1 min read
తుదిదశకు జాతీయ రహదారి పనులు
చెన్నై -కలకత్తా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుంటూరు- విజయవాడ నగరాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ
చెన్నై -కలకత్తా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుంటూరు- విజయవాడ నగరాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. కృష్ణాజిల్లా గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో నూతన జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిమీ మేర ఆరు వరుసల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. మంగళగిరి నగరానికి పడమర వైపు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ కు వెళ్లే వాహనదారులు విజయవాడ నగరానికి వెళ్లకుండానే జాతీయ రహదారి మీదుగా అతి తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకోవచ్చు.