News13th Nov 09:46 AMSunil Byrisetty1 min read

రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఐఐ సదస్సు

విశాఖపట్నంలో 30వ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత

రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఐఐ సదస్సు
విశాఖపట్నంలో 30వ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే విశాఖకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నోవోటెల్‌లో జరిగే ‘ఇండియా-యూరప్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌’ సమావేశంతో సీఎం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. యూరోపియన్‌ పెట్టుబడులు, గ్రీన్‌ షిఫ్ట్, సస్టెయినబుల్‌ ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్‌ ప్రతినిధులతో పాటు ఎస్పీపీ పంప్స్‌, రెన్యూపవన్, మురుగప్ప గ్రూపు, హీరో ఫ్యూచర్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు.
Andhra Pradesh
CII 2025
Visakhapatnam
Investment Summit
Chandrababu Naidu
Business Summit
India Europe Business
Green Innovation
Sustainable Growth
సస్టెయినబుల్ గ్రోత్
పారిశ్రామిక అభివృద్ధి
మేక్ ఇన్ ఏపీ
గ్లోబల్ ఇన్వెస్టర్స్
ఆర్థికాభివృద్ధి
Scroll for the next article