News6th May 12:43 PMSunil Byrisetty1 min read
‘తల్లికి వందనం' పై తాజా నిర్ణయం!
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు ఇచ్చే నగదు ప్రోత్సాహం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై స్పష్టత ఇచ్చారు. కాగా, ఇకే విడతలోనే అమల
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు ఇచ్చే నగదు ప్రోత్సాహం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.
సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై స్పష్టత ఇచ్చారు. కాగా, ఇకే విడతలోనే అమలు చేస్తారా.. రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది.
ఇక.. దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.
ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు.
తాజాగా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు.
2025- 26 బడ్జెట్లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు.
\ 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు.
పథకం అమల్లో భాగంగా విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది.
ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.