News7th Oct 03:01 PMSunil Byrisetty1 min read
రామ్మూర్తి నాయుడు వర్థంతిలో పాల్గొన్న సీఎం, మంత్రి లోకేష్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన దివంగత నారా రామ్మూర్ తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన దివంగత నారా రామ్మూర్ తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నారావారిపల్లెలోని తమ నివాసంలో రామ్మూర్ తినాయుడు ప్రథమ వర్థంతికి సంబంధించిన క్రతువులో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రామ్మూర్ తినాయుడు స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లికి బయలుదేరి రానున్నారు.