News5th Sep 03:11 PMSunil Byrisetty1 min read
ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు నిర్ణయాలు
ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి నిర్ణయాలు వెలువరించారు. సీఎం ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 12వ PR
ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి నిర్ణయాలు వెలువరించారు. సీఎం ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 12వ PRC నియామకానికి అంగీకారం తెలపడంతోపాటు రెండు డిఎలు అక్టోబర్ 1 నుంచి చెల్లిస్తామని చెప్పారు. 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకారం తెలిపారు. పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లిస్తామన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు కానుంది.