News11th Aug 04:45 PMSunil Byrisetty1 min read

ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్

ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిం

ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్
ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ”పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు.. ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందిస్తే జాతి నిర్మాణానికి సహకరించినట్టే. ప్రతి ఉద్యోగి.. ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ టేకప్ చేయాలి. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్ వాల్వ్ అవుతారనడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనం. వాస్తవాలను ప్రజలకు వివరించగలిగితే.. ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారు. దీనికి కర్నూలులో డీఎస్సీ-2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ. నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించాం. జూలై నెలలో 10.70 శాతం వృద్ధిని నమోదు చేయగలిగాం. ఎల్ నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుంది. ఇప్పుడే అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు.
Swarna Andhra
AP Government
Chandrababu Naidu
Nation Building
Partners in Nation Building
Public Participation
Viksit Bharat
ప్రభుత్వ సేవలు
రోడ్ డాక్టర్
జీరో పాత్‌హోల్ మిషన్
ఆర్థిక వృద్ధి
ఎల్ నినో
ఏపీ అభివృద్ధి
Scroll for the next article