News11th Sep 01:00 PMSunil Byrisetty1 min read
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎన్నిరోజులు తీసుకుంటున్నారో డేటా ఉందని చంద్రబాబు అన్న
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎన్నిరోజులు తీసుకుంటున్నారో డేటా ఉందని చంద్రబాబు అన్నారు. వచ్చే సదస్సు నాటికి మార్పు రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫైల్స్ క్లియరెన్స్లో జాప్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. సమావేశానికి ఫోన్లు తీసుకురావడంపై చంద్రబాబు మండిపడ్డారు. వాట్సాప్ మెసేజ్లు చూస్తున్నారు కానీ.. డిపార్ట్మెంట్కు సంబంధించినది చూడటం లేదని వ్యాఖ్యానించారు. ఫోన్లు లేకుండా 12 గంటలు ఉండలేకపోతే ఎలా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.