Politics1st Nov 11:27 AMSunil Byrisetty1 min read

ఇద్దరు నేతలపై చంద్రబాబు సీరియస్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు,

ఇద్దరు నేతలపై చంద్రబాబు సీరియస్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారని, అలాంటివాళ్లు నిరభ్యంతరంగా బయటికి వెళ్లి పోటీ చేయొచ్చు అంటూ పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. సిద్ధాంతాలపై అవగాహన లేనివారికి టికెట్లిస్తే తిరువూరులాంటి పరిస్థితులే ఎదురవుతాయన్నారు. పార్టీ అండ లేకపోతే వారి పరిస్థితేంటో అప్పుడు అర్థమవుతుందని చెప్పారు. క్రమశిక్షణా కమిటీ వీరి వ్యవహారంపై పరిశీలించి, మాట్లాడాలని సూచించారు. లండన్ పర్యటన తర్వాత నివేదిక ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు.
Andhra Politics
Chandrababu Naidu
TDP
Kesineni Sivanath
Kolikipudi Srinivas Rao
TDP Discipline
విజయవాడ
తిరువూరు
రాజకీయ వార్తలు
తెలుగు దేశం పార్టీ
Scroll for the next article