News31st Jul 05:01 PMSunil Byrisetty1 min read
పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..!
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్చార్జ్ల శిక్షణా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశ
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్చార్జ్ల శిక్షణా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం చంద్రబాబు బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయ ప్రారంభంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్నారు.