News13th Aug 05:14 PMSunil Byrisetty1 min read
మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్!
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. APPSC గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీప
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. APPSC గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ హయాంలోని APPSC గ్రూప్-1 వ్యవహారంపై చర్చిద్దామని మంత్రులు సూచించారు. సిట్ నివేదికలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని APPSC కార్యదర్శి PSR ఆంజనేయులు పాత్రపై దర్యాప్తు జరపాలని మంత్రులు కోరారు. సిట్ నివేదికపై కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.