Education5th Apr 04:37 PMSunil Byrisetty1 min read

సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో

సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో  ముచ్చటించిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ల వెళ్లిన సీఎం చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాల అంతా కలియదిరిగారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరుకుల నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా అని అడిగారు. అనంతరం డార్మెటరీని పరిశీలించారు.
CM Chandrababu
Gurukula
Students
బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ముప్పాళ్ల
Scroll for the next article