News23rd Jul 05:05 PMSunil Byrisetty1 min read
మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించిం
మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించింది. ప్రతి ల్యాండ్ పార్సెల్కు ప్రత్యేక డిజిటల్ ఐడీ ఇచ్చి టాంపర్-ప్రూఫ్, సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చెయిన్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చెయిన్ విధానం ఉండనుంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలను ఒకే వేదిక మీదకు తెచ్చేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ పని చేస్తుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ అమలు కానుంది. ఈ సందర్భంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ అమలు జరిగే తీరును వివరించే వీడియోను అధికారులు ప్రజెంట్ చేశారు.