News22nd Oct 11:31 AMSunil Byrisetty1 min read

దుబాయ్‌ పర్యటనలో తొలిరోజే 5 సంస్ధలతో సీఎం చంద్రబాబు భేటీలు

దుబాయ్‌ పర్యటనలో భాగంగా తొలిరోజు 5 సంస్ధల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వన్‌ టు వన్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. నేడు శోభా గ్రూప్‌, షరాఫ్‌ డీజీ, ట్రాన్స్‌ వరల్డ్‌ గ్రూప్‌, లూధా గ్రూ

దుబాయ్‌ పర్యటనలో తొలిరోజే 5 సంస్ధలతో సీఎం చంద్రబాబు భేటీలు
దుబాయ్‌ పర్యటనలో భాగంగా తొలిరోజు 5 సంస్ధల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వన్‌ టు వన్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. నేడు శోభా గ్రూప్‌, షరాఫ్‌ డీజీ, ట్రాన్స్‌ వరల్డ్‌ గ్రూప్‌, లూధా గ్రూప్‌, దుబాయ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. మ్యూజియం సందర్శనలో భాగంగా స్పేస్‌ ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ పరిశీలిస్తారు. రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌ షోలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. యూఏఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, అధికారులు పాల్గొంటున్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Dubai Visit
UAE
Business Meetings
CII Partnership Summit
Visakhapatnam
Shobha Group
Sharaf DG
Transworld Group
Lutha Group
Dubai Future Foundation
Industrial Investment
Scroll for the next article