News19th Jan 12:59 PMSunil Byrisetty1 min read
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్ &
ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్ & లీచ్టెన్స్టెయిన్ భారత రాయబారి అంబర్ కుమార్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు, సాంకేతికత ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన సాగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలు మరియు సాంకేతిక రంగాలలో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు, భాగస్వామ్యాలకు ఏపీ అత్యంత అనుకూలమైన వేదిక." అని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.