News15th Jan 02:53 PMSunil Byrisetty1 min read
17న కాకినాడకు సీఎం చంద్రబాబు
జనవరి 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటన చేయనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. కాకినాడ సెజ్ (KSEZ) పరిధిలోని పెద్దాపురం మండలం కొమరిపాలెం వ
జనవరి 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటన చేయనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. కాకినాడ సెజ్ (KSEZ) పరిధిలోని పెద్దాపురం మండలం కొమరిపాలెం వద్ద గ్రీన్కో గ్రూప్ ఏర్పాటు చేయనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, ఈ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.