News28th Dec 03:30 PMSunil Byrisetty1 min read
అయోధ్య రామజన్మభూమిలో సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు నేతలు ఉన
ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు నేతలు ఉన్నారు.
దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, ఇతర విశేషాలను వివరించారు. ఆయన ఆసక్తిగా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకు ఎంతో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ పర్యటనపై చంద్రబాబు స్పందిస్తూ, "ఈరోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది. మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని తెలిపారు.