News12th Jan 12:28 PMSunil Byrisetty1 min read

'పోలవరం-నల్లమల సాగర్'పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

పోలవరం అత్యద్భుతమైన ప్రాజెక్టు అని.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రం

'పోలవరం-నల్లమల సాగర్'పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
పోలవరం అత్యద్భుతమైన ప్రాజెక్టు అని.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నామని చెప్పారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు.. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చని, పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.
Andhra Pradesh Irrigation
Polavaram Project
Nallamala Sagar
Chandrababu Naidu
Godavari Water
Rayalaseema
ప్రకాశం జిల్లా
నీటి వనరులు
రాష్ట్ర అభివృద్ధి
రెండు తెలుగు రాష్ట్రాలు
Scroll for the next article