Business Type21st Jul 09:28 AMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుకు కలిసొచ్చింది!
సీఎం చంద్రబాబుకు సతీమణి భువనేశ్వరి వల్ల భారీగా కలిసొచ్చింది. నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి షేర్ల విలువ భారీగా పెరగడంత
సీఎం చంద్రబాబుకు సతీమణి భువనేశ్వరి వల్ల భారీగా కలిసొచ్చింది. నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి షేర్ల విలువ భారీగా పెరగడంతో వారికి కోట్లు లాభం లభించింది. ఒక్కరోజే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీల నుంచి తప్పుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తో పాటు హెరిటేజ్ సేవా విభాగాలకు సంబంధించిన సేవలను మాత్రమే నారా భువనేశ్వరి నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట ఆమె షేర్ మార్కెట్లో డిపాజిట్లు చేయగా.. ఒకేసారి ఏడు శాతానికి పెరగడంతో రూ.78.80 కోట్ల ఆదాయం ఒక్కరోజే వచ్చిందని సమాచారం.