Education10th Jul 11:05 AMSunil Byrisetty1 min read
ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు
పుట్టపర్తి, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలోని పదో తరగతి గదిని పరిశీలించి విద్యార్ధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స
పుట్టపర్తి, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలోని పదో తరగతి గదిని పరిశీలించి విద్యార్ధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్పూర్తిని నింపేలా సీఎం కౌన్సెలింగ్ ఇచ్చారు. మెరుగ్గా ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలోని 8 తరగతి గదిని కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి కాసేపు ఉపాధ్యాయుడిగా మారారు. సోషల్ సైన్స్ పాఠాన్ని విద్యార్ధులకు బోధించారు. అలాగే విద్యార్ధిలా మారిన మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సోషల్ సైన్స్ పాఠాన్ని శ్రద్ధగా విన్నారు.