News1st Aug 12:11 PMSunil Byrisetty1 min read
ప్రధానికి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన సీఎం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మొత్తం 2,703 ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ టెర్మినల్ను పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొందూరు జాందానీ శాలువాతో సత్కరించారు. అనంతరం చారిత్రక సంగీత వాయిద్యం బొబ్బిలి వీణను అందజేశారు.