News14th Jul 03:32 PMSunil Byrisetty1 min read
ఏపీ ఫైబర్ నెట్పై సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీ ఫైబర్ నెట్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫైబర్ నెట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజకీయ అవసరాల కోసం ఫైబర్ నెట్ను గత ప్రభుత్వం నాశనం చేసిందన
ఏపీ ఫైబర్ నెట్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫైబర్ నెట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజకీయ అవసరాల కోసం ఫైబర్ నెట్ను గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఫైబర్ నెట్ కనెక్షన్లు సగానికి తగ్గాయన్నారు. పార్టీ కార్యకర్తలను నియమించి నిధులు దుర్వినియోగం చేశారని, ఫైబర్ నెట్ కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు యత్నించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఫైబర్ నెట్కు రూ.200 కోట్లు ఇచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.