Politics13th Apr 01:17 PMSunil Byrisetty1 min read

టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్!

టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిజమే, కడపలో మహానాడు నిర్వహణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశంలో పులివెందుల టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్

టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్!
టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిజమే, కడపలో మహానాడు నిర్వహణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశంలో పులివెందుల టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో నేతల కుమ్ములాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వర్గమే ఉండాలి.. రెండవ వర్గానికి తావులేదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పులివెందుల వ్యవహారంపై ఎమ్మెల్సీకి సీఎం చంద్రబాబు చురకలంటించారు. కడపలో మహానాడు నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని క్లాస్ తీసుకున్నారు.
CM Chandrababu
TDP
Kadapa
Pulivendula TDP Leaders
మహానాడు
మంత్రి సవిత
Scroll for the next article