Politics9th Mar 10:53 AMSunil Byrisetty1 min read

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నేడే?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఖాళీ అయిన 5 స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా జనసేన తరఫున నాగబాబు నామినేషన్ వేశారు. మిగిలిన

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నేడే?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఖాళీ అయిన 5 స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా జనసేన తరఫున నాగబాబు నామినేషన్ వేశారు. మిగిలిన 4 స్థానాలకు నామినేషన్ గడువు మార్చి 10వ తేదీ (సోమవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అధిష్టానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేయనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్టు సమాచారం. ఆదివారం రాత్రిలోగా అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
MLC Elections
TDP
Chandrababu
Andhra Pradesh
ఎమ్మెల్సీ ఎన్నికలు
టీడీపీ
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article