News16th Sep 01:22 PMSunil Byrisetty1 min read
జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదు
జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా రాష్ట్రమంతా వర్తింపచేయాలన్నారు. ఏటికొప్
జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా రాష్ట్రమంతా వర్తింపచేయాలన్నారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి అని, వృక్షాలు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం కార్యక్రమం రూపొందించాలన్నారు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురు సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సీఎం సూచనలు చేశారు.