Telangana25th Oct 01:13 PMSunil Byrisetty1 min read
ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డీసీసీ ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ నెలాఖరుకు లేదా నవంబర్ మొదటి వారంలో 39 జిల్లాలతో పాటు పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నిక, ఇతర అంశాలపైనా చర్చ జరగనుంది.