News24th Jul 09:41 AMSunil Byrisetty1 min read
పిల్లలున్న వారికి సీఎం బంపర్ ఆఫర్!
ఏపీలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు తరచుగా ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగా జనాభాను పెంచే చర్యలు ప్రారంభించారు. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉ
ఏపీలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు తరచుగా ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగా జనాభాను పెంచే చర్యలు ప్రారంభించారు. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. నిపుణులు, మేధావుల సూచనలతో సంతానోత్పత్తి రేటును పెంచే విధంగా ప్రోత్సాహకాలను ప్రతిపాదించారు.
ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంకు ఆస్తి పన్ను మినహాయింపు ఉంటుందని ముసాయిదాలో చేర్చారు. ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలకు పొడిగించారు. మూడో బిడ్డ ఉంటే అదనంగా రూ. 50 వేలు ప్రోత్సాహకం అందిస్తారు. నాలుగో బిడ్డకూ ఇది కొనసాగుతుంది. పిల్లలు పుట్టేందుకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సహాయం అందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. తల్లులకు వర్క్ ఫ్రం హోం కల్పించాలని ముసాయిదాలో చేర్చారు.