Politics4th Sep 06:00 PMSunil Byrisetty1 min read
బొద్దింకలు ఇక రెండు వర్గాలు!
బొద్దింకల జనతా పార్టీలో అప్పుడే చీలికలు బయటపడ్డాయి. ఎవరి రాజకీయం వాళ్లదేనంటూ రెండు వర్గాలుగా మారాయి. నీట్ పై పోరాటానికి ఆవిరర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక వచ్చింది. CJP-డెమ
బొద్దింకల జనతా పార్టీలో అప్పుడే చీలికలు బయటపడ్డాయి. ఎవరి రాజకీయం వాళ్లదేనంటూ రెండు వర్గాలుగా మారాయి. నీట్ పై పోరాటానికి ఆవిరర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక వచ్చింది. CJP-డెమోక్రటిక్ పేరిట కొత్త వర్గం ఆవిర్భవించింది. విద్యార్థి ఉద్యమంతో ఆవిర్భవించిన పార్టీని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన స్వప్రయోజనాల కోసం, కేజ్రీవాల్ , ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తిరుగుబాటు నేత మనీష్ బ్రహ్మ్భట్ సంచలన ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్ వద్ద రక్తం, చెమట చిందించి పోరాడిన అసలైన కార్యకర్తలను, విద్యార్థులను పక్కనబెట్టి రాజకీయ వ్యాపారాలు చేస్తున్నారంటూ రెబెల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీప్కే అత్యంత సన్నిహితులకే పదవులు కడుతున్నారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.