News7th Sep 11:25 AMSunil Byrisetty1 min read
యువకుల ర్యాలీలో పాక్ జెండాలు
పాక్ జెండాలతో ర్యాలీ చేసిన యువకులపై కేసు నమోదైంది. కాకినాడ, జగన్నాథపురంలో మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో కొందరు యువకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్తో పాటు పాలస్తీనా జె
పాక్ జెండాలతో ర్యాలీ చేసిన యువకులపై కేసు నమోదైంది. కాకినాడ, జగన్నాథపురంలో మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో కొందరు యువకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్తో పాటు పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్న వేళ ఈ ఘటన వివాదాస్పదంగా మారింది.