News29th Aug 11:22 AMSunil Byrisetty1 min read
సీఎంకు సీపీఐ నేత లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు విడుదల చేసి ఆదుకోండని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పార
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు విడుదల చేసి ఆదుకోండని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దాదాపు రూ.1200 కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గత ఏడాదికాలంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరారు.