News15th Sep 03:13 PMSunil Byrisetty1 min read

కరువు పరిస్థితిపై సీపీఎం బృందాల పర్యటన

రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. 655 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 80% పంటలు వేయలేదు. వేసినచోట కూడా పంటలు దెబ్బతిన్నాయి. మంచినీరు కొరత, విద్యుత్ కోత మొదలైంది. ఉపాధి లేక కూ

కరువు పరిస్థితిపై సీపీఎం బృందాల పర్యటన
రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. 655 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 80% పంటలు వేయలేదు. వేసినచోట కూడా పంటలు దెబ్బతిన్నాయి. మంచినీరు కొరత, విద్యుత్ కోత మొదలైంది. ఉపాధి లేక కూలీలు అల్లాడుతున్నారు. దీనికి తోడు అధిక ధరల మోత. మొత్తం మీద ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నారు. రాష్ట్రంలో కరువు వల్ల సుమారు 5 లక్షల కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తీవ్రతకనుగుణంగా స్పందించి కరువు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. కేంద్ర బృందాలు పర్యటించి పరిస్థితిని అంచనా వేయలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 కరువు బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి, బి.బలరాం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు ఈ మూడు బృందాలు వివిధ జిల్లాల్లో పర్యటిస్తాయి.
Andhra Pradesh Drought
CPM
CPI(M)
Drought Conditions
Farmers
Crop Loss
Rainfall Deficit
Agricultural Crisis
మంచినీటి కొరత
విద్యుత్ కోతలు
వ్యవసాయ కూలీలు
కె లోకనాథం
కె ప్రభాకరరెడ్డి
బి బలరాం
Scroll for the next article