News3rd Jan 05:33 PMSunil Byrisetty1 min read

అవినీతి తిమింగలాల పని.. ఏఐతో చెక్

ఏపీలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వ

అవినీతి తిమింగలాల పని.. ఏఐతో చెక్
ఏపీలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అవినీతిపరుల బినామీ ఆస్తుల డేటాను సేకరించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఏసీబీ కొత్త వ్యూహాలను, లక్ష్యాలను వివరించారు. "రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం. ఈ ఏడాది అవినీతి తిమింగలాల పని పడతాం. అవినీతికి పాల్పడినవారిని మూడేళ్లలోనే జైలుకు పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం," అని అన్నారు. ఐజీఆర్ఎస్ వ్యవస్థ నుంచి బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమానిత బ్యాంకు లావాదేవీలను ఏఐ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.
AP ACB
Anti Corruption Bureau
Atul Singh
Corruption
Corruption Crackdown
AI Technology
Benami Properties
బ్యాంకు లావాదేవీలు
నిఘా
2025 వార్షిక నివేదిక
Scroll for the next article