News29th Dec 02:48 PMSunil Byrisetty1 min read
నేరాలు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ
2025లో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం క్రైమ్ రేటు 6 శాతం తగ్గినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలప
2025లో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం క్రైమ్ రేటు 6 శాతం తగ్గినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై హింసకు సంబంధించిన కేసులు తగ్గాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే సైబర్ క్రైమ్లు, సోషల్ మీడియాకు సంబంధించిన నేరాలు గణనీయంగా పెరిగినట్లు డీజీపీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.