News17th Jul 03:15 PMSunil Byrisetty1 min read

ఫ‌స‌ల్ బీమాతో అన్న‌దాత‌కు ఆర్థిక ధీమా

ఆప‌త్కాలంలో అండ‌గా నిలిచే పంట బీమా ప‌థ‌కాల‌ను అన్న‌దాత‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. రుణం తీసుకునే రైతులతో పాటు రుణేతర రైతులు కూడ

ఫ‌స‌ల్ బీమాతో అన్న‌దాత‌కు ఆర్థిక ధీమా
ఆప‌త్కాలంలో అండ‌గా నిలిచే పంట బీమా ప‌థ‌కాల‌ను అన్న‌దాత‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. రుణం తీసుకునే రైతులతో పాటు రుణేతర రైతులు కూడా తప్పనిసరిగా పథకాల్లో చేరాల‌ని సూచించారు. ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఫసల్ బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, పున‌ర్నిర్మించిన వాతావ‌ర‌ణ ఆధారిత పంట బీమా ప‌థ‌కాల్లో చేరేలా ప్రోత్సహించాల‌న్నారు. ఇందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ప్ర‌త్యేక డ్రైవ్‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. వీటితో అతి త‌క్కువ ప్రీమియంతోనే క‌ష్ట‌కాలంలో అధిక ఆర్థిక భ‌రోసా ల‌భించ‌నుంద‌ని.. ఉదాహ‌ర‌ణ‌కు వ‌రికి ఎక‌రాకు బీమా మొత్తం రూ. 42,500 కాగా రైతు వాటా ప్రీమియం రూ. 850 చెల్లిస్తే స‌రిపోతుంద‌న్నారు. వ‌రికి సంబంధించి ప‌థ‌కంలో న‌మోదుకు ఆగ‌స్టు 15వ తేదీ ఆఖ‌రు తేదీ కాగా ఎర్ర మిర‌ప‌, మొక్క‌జొన్న‌, పెస‌ర‌కు జులై 31 చివ‌రితేదీ అని తెలిపారు. ప‌త్తికి ఈ నెల 24వ తేదీలోగా న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు.
Andhra Pradesh
El Niño
PM Fasal Bima Yojana
Crop Insurance
Farmers
Agriculture
NTR District
ఎల్‌నినో
వరి
పత్తి
మొక్కజొన్న
ఎర్ర మిరప
పెసర
వ్యవసాయ వార్తలు
Scroll for the next article