Crime25th Aug 12:12 PMSunil Byrisetty1 min read
సైనేడ్ కొని.. దారుణంగా చంపి!
కాకినాడకు చెందిన AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డిని చంపడానికి సాదిక్ ఖాన్ హైదరాబాద్లో
కాకినాడకు చెందిన AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డిని చంపడానికి సాదిక్ ఖాన్ హైదరాబాద్లో సైనేడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌజన్య భర్త జగదీశ్వర్రెడ్డికి ప్రొటీన్ పౌడర్లో సైనేడ్ కలిపి ఇచ్చినట్లు సాదిక్ ఖాన్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో సాదిక్ ఖాన్కు సైనేడ్ విక్రయించిన వర్తకుడి కోసం పోలీసుల గాలిస్తున్నారు. హైదరాబాద్కు ప్రత్యేక పోలీస్ బృందాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.