News8th Jan 10:25 AMSunil Byrisetty1 min read

దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు!

వాయుగుండం హెచ్చరికలతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇది తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీప

దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు!
వాయుగుండం హెచ్చరికలతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇది తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి పొట్టువిల్‌ (శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలోవా (శ్రీలంక)కు 620 కిలోమీటర్లు, కరైకల్‌ (తమిళనాడు)కు 990 కిలోమీటర్లు, చెన్నైకి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 48 గంటల్లో పశ్చిమ -వాయవ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.
Cyclone Alert
Southern States
Weather Warning
IMD
Bay of Bengal
Andhra Pradesh Rains
Tamil Nadu
Sri Lanka
Low Pressure Area
Disaster Management
Scroll for the next article