News3rd Oct 09:25 AMSunil Byrisetty1 min read
భక్త కూలీకి వజ్రం ఇచ్చిన అమ్మవారు!
నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుండగా అద్భుతం జరిగింది. ఓ భక్తుడు దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు. మధ్యప్రదేశ్ పన్నాలో దినసరి కూలీ గోవింద్ సింగ్ అదృష్టం ఒక్కసారిగా
నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుండగా అద్భుతం జరిగింది. ఓ భక్తుడు దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు. మధ్యప్రదేశ్ పన్నాలో దినసరి కూలీ గోవింద్ సింగ్ అదృష్టం ఒక్కసారిగా మెరిసింది. నవరాత్రి సందర్భంగా దుర్గాదేవి ఆలయం దర్శించి వస్తుండగా రోడ్డుపై అతనికి వజ్రం దొరికింది. అది 4.04 క్యారెట్ల విలువైన వజ్రమని నిపుణులు నిర్ధారించగా, దాని ధర రూ.1.5 కోట్లు పైగానే ఉంటుందని తెలిపారు. అకస్మాత్తుగా కోటీశ్వరుడైన గోవింద్ సింగ్ దీనిని అమ్మవారి దయ, అద్భుతం అని చెప్పాడు.