News27th May 08:27 AMSunil Byrisetty1 min read
మృతదేహాలు అప్పగించండి.. సీఎంకు సీపీఐ లేఖ!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. చత్తీస్గడ్ లో మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ లేఖ రాశారు. చత్తీస్గడ్ లో జరిగిన పోలీసుకాల్పుల్లో మర
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.
చత్తీస్గడ్ లో మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ లేఖ రాశారు.
చత్తీస్గడ్ లో జరిగిన పోలీసుకాల్పుల్లో మరణించిన నంబాల కేశవరావుతోసహా మరో నలుగురి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. చత్తీస్గడ్ కు చెందిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారని తెలిపారు.
తెలుగువారి పట్ల పక్షపాతం సరైంది కాదని సిపిఐ రామకృష్ణ పేర్కొన్నారు.