News8th Oct 10:06 AMSunil Byrisetty1 min read
రేపు పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9వ తేదీ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9వ తేదీ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు. ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పిఠాపురం నియోజక వర్గంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.