News15th Nov 04:57 PMSunil Byrisetty1 min read

విశాఖ గోమాంసం నిల్వలపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్

విశాఖ నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ దందా వెనుక ఉన్న ముఠాల మూలాలను తక్షణమే వెలికితీయాలని విశాఖ పోలీసులను

విశాఖ గోమాంసం నిల్వలపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
విశాఖ నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ దందా వెనుక ఉన్న ముఠాల మూలాలను తక్షణమే వెలికితీయాలని విశాఖ పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఘటన వెలుగులోకి రాగానే ఆయన నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీలో జరిపిన దాడుల్లో 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని, కేసును పోలీసులకు అప్పగించినట్లు కమిషనర్ పవన్ కల్యాణ్‌కు వివరించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ మాంసాన్ని ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడికి తరలించాలని చూశారు, అనుమతుల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Pawan Kalyan
Visakhapatnam News
Illegal Beef Storage
DRI Raids
డీఆర్ఐ దాడులు
ఏపీ పోలీస్
నేర వార్తలు
కోల్డ్ స్టోరేజ్
Scroll for the next article