News9th Oct 12:30 PMSunil Byrisetty1 min read
మత్స్యకారులతో మాట–మంతికి పవన్ కల్యాణ్
ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో మాట–మంతి కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడలో శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కాకినాడ జిల
ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో మాట–మంతి కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడలో శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంత మాట – మంతి కార్యక్రమం మొదలైంది. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తమ సమస్యల్ని వివరిస్తున్నారు. వాటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోట్ చేసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారి సమస్యలపై మాట్లాడనున్నారు.