News10th Sep 04:53 PMSunil Byrisetty1 min read
పులి సంచారంపై పవన్ సమీక్ష
కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పులి జనావాస ప్రాంత
కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచనలు చేశారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు.. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉండాలని కోరారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం - పులికి ఎలాంటి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు.