News11th Oct 03:09 PMSunil Byrisetty1 min read
నన్ను ప్రభావితం చేసింది పుస్తకాలే: పవన్ కల్యాణ్
తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించ
తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన 'ఆమె సూర్యుడిని కబళించింది' అనే పుస్తకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పవన్ కల్యాణ్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు.