News28th Aug 11:39 AMSunil Byrisetty1 min read
పురపాలికల్లో అభివృద్ధి పరుగులు!
ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పరుగులు తీయనుంది. ఆయా పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన కోసం ₹7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన
ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పరుగులు తీయనుంది. ఆయా పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన కోసం ₹7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతుల్లో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. ప్రధానంగా 100% రోడ్డు అనుసంధానం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 123 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 4,388 కి.మీ రోడ్ల నిర్మాణం & అభివృద్ధి పనులకు
₹4,655.82 కోట్లు కేటాయించారు. డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రోడ్ల నిర్మాణానికి ₹509.12 కోట్లు కేటాయింపు చేశారు 541 కొత్త పార్కుల అభివృద్ధి, పచ్చదనానికి ప్రాధాన్యత కింద
₹247.28 కోట్లు కేటాయించారు. 20,340 నూతన వీధి దీపాల ఏర్పాటు చేయనున్నారు.
₹87.78 కోట్లతో 1,186 కి.మీ రోడ్ మీడియన్ల సుందరీకరణ చేపట్టనున్నారు.