Spiritual20th Aug 11:32 AMSunil Byrisetty1 min read
దుర్గమ్మకు రూ.21 లక్షల విలువైన ఆభరణం
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఒక భక్తురాలు భారీ విరాళాన్ని సమర్పించారు. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన తవ్వా పుల్లమ్మ ఆలయ అధి
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఒక భక్తురాలు భారీ విరాళాన్ని సమర్పించారు. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన తవ్వా పుల్లమ్మ ఆలయ అధికారులను కలిసి శ్రీ అమ్మవారిపై ఉన్న భక్తిశ్రద్ధలతో ఈ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్తమిత్రుడు కావడంతో, ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని (రాళ్ళతో కూడిన బంగారు పూసల పేరు) ఆమె అందజేశారు. ఈ ఆభరణం యొక్క అంచనా విలువ సుమారు రూ. 21,00,000 ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం, టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. దాతలు సమర్పించిన ఈ కానుకను ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.