Entertainment17th Nov 01:28 PMSunil Byrisetty1 min read
నాగార్జున కుటుంబంపై సైబర్ దాడి!
అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడ్డారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు గురించి నాగార్జున స్వయంగా బయటపెట్టారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వి
అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడ్డారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు గురించి నాగార్జున స్వయంగా బయటపెట్టారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. నటులు చిరంజీవి నాగార్జున, నిర్మాత దిల్ రాజు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున.. తన కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడిందని వెల్లడించారు. తన కుటుంబంలో ఒకరిని డిజిటల్ అరెస్ట్ పేరుతో కేటుగాళ్లు ఇబ్బందికి గురిచేసినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో దాని నుంచి బయటపడినట్లు చెప్పారు.