Spiritual23rd Sep 09:41 AMSunil Byrisetty1 min read
గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం
గాయత్రీ దేవి.. "వేదమాత" (వేదాల తల్లి).. వేదమంతటినీ తనలో ఉంచుకున్న మహా శక్తిరూపిణి. సర్వలోకాలను సృష్టించే, పోషించే, లయపరిచే పరమేశ్వర శక్తి రూపమే గాయత్రీ దేవి. సూర్యుడి కాంతిలో, అగ్న
గాయత్రీ దేవి.. "వేదమాత" (వేదాల తల్లి).. వేదమంతటినీ తనలో ఉంచుకున్న మహా శక్తిరూపిణి. సర్వలోకాలను సృష్టించే, పోషించే, లయపరిచే పరమేశ్వర శక్తి రూపమే గాయత్రీ దేవి. సూర్యుడి కాంతిలో, అగ్నిలో, ప్రతి మంత్రంలో ఆమె శక్తి ప్రస్ఫుటిస్తుంది.
*అవతార విశేషాలు:*
బ్రహ్మదేవికి సహచరిణి – సృష్టికారకుడైన బ్రహ్మదేవి తన తపస్సుకు ప్రతిఫలంగా గాయత్రీ దేవిని పొందాడు. బ్రహ్మదేవుని యజ్ఞకార్యాలకు, వేదాధ్యయనానికి, శక్తిరూపంలో తోడుగా నిలిచింది.
ఐదు ముఖములు, పది చేతులు – గాయత్రీ దేవి సాధారణంగా ఐదు ముఖాలతో, పది చేతులతో దర్శనమిస్తారు. ఐదు ముఖాలు పంచ ప్రాణములను, పంచభూతములను సూచిస్తాయి. పది చేతులు దశదిక్కులలో ఉన్న శక్తులను సూచిస్తాయి.
గాయత్రీ మంత్ర రూపిణి –
"ఓం భూర్భువస్సువః
తత్ సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్"
ఈ మంత్రం గాయత్రీ దేవి స్వరూపం. ఇది సూర్యనారాయణుని శక్తిరూపం. దీనిని జపించడం వల్ల మానసిక, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
త్రిగుణాత్మిక స్వరూపం – గాయత్రీ దేవి సత్య, రజో, తమో గుణాల సమ్మేళనం. సృష్టి (బ్రహ్మ), స్థితి (విష్ణు), లయ (రుద్ర) స్వరూపాలను కలిగిన త్రిమూర్తుల తల్లి.
లోకాల రక్షకురాలు – ధ్యానం, జపం ద్వారా భక్తులను పాపములనుండి రక్షించే దివ్యశక్తి. గాయత్రీ ఉపాసన ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది, జ్ఞానం పెరుగుతుంది, దివ్యదర్శనం కలుగుతుంది.
వేదస్వరూపిణి – నాలుగు వేదాల మూలం గాయత్రీ. అందుకే ఆమెను "వేదమాత" అని పిలుస్తారు. వేద పఠనం ప్రారంభించే ముందు గాయత్రీ జపం చేయడం శాస్త్రోక్తం.