Spiritual8th Dec 01:11 PMSunil Byrisetty1 min read
కళ్యాణ మండపంలో నేత్రపర్వంగా 'గరుడ సేవ'
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో, గరుడ సేవ కమనీయంగా, నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా నిర్వహించిన
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో, గరుడ సేవ కమనీయంగా, నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలో అధిష్టింపజేశారు.
పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణలో, ఆలయ అర్చక స్వాములు ఈ సేవను నిర్వహించారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పాల్గొన్న భక్తుల గోత్రనామాలను పఠిస్తూ సంకల్పం చెప్పారు.
సేవ అనంతరం మంత్రపుష్పం, మంగళాశాసనాలు జరిపి, భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఈ గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు.